Nalgonda News : శ్రీ కంఠమహేశ్వర స్వామి ఆలయ పున: ప్రతిష్టాపన
పెద్ద ఎత్తున హజరైన బిఆర్ఎస్, కాంగ్రేస్ నాయకులు..స్వామివారికి ప్రత్యేక పూజలు

ఎరగండ్లపల్లిలో శ్రీ కంఠమహేశ్వర స్వామి ఆలయ శిఖర కలశ ప్రతిష్టాపన చేస్తున్న ఆలయ కమిటీ సభ్యులు
శ్రీ కంఠమహేశ్వర స్వామి ఆలయ పున: ప్రతిష్టాపన
- శ్రీ కంఠమహేశ్వర స్వామికి బిఆర్ఎస్ నేతల ప్రత్యేక పూజలు
- హాజరైన మాజీ ఎమ్మెల్యేలు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, బూడిద బిక్షమయ్య గౌడ్, భువనగిరి పార్లమెంట్ ఇన్చార్జి క్యామ మల్లేష్
మర్రిగూడ - ప్రభాత సూర్యుడు
నల్గొండ జిల్లా మర్రిగూడ మండలంలోని ఎర్రగండ్లపల్లిలో శ్రీ కంఠమహేశ్వర స్వామి ఆలయంలో శనివారం విశేష పూజా కార్యక్రమాలను నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ మునుగోడు ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బూడిద బిక్షమయ్య గౌడ్, భువనగిరి పార్లమెంట్ ఇన్చార్జి క్యామ మల్లేష్, మాజీ కల్లుగీత కార్పొరేషన్ చైర్మన్ పల్లె రవికుమార్ గౌడ్, బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథులుగా శిఖర కలశ ప్రతిష్టాపనలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.
శ్రీ కంఠమహేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజాకార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బూడిద బిక్షమయ్య గౌడ్,మాజీ కల్లుగీత కార్పొరేషన్ చైర్మన్ పల్లె రవికుమార్ గౌడ్ తదితరులు
ఈ సందర్భంగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. భగవంతుని ఆశీస్సులు ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. పండుగలు సంస్కృతి సాంప్రదాయాల మనుగడకు తోడ్పడతాయని అన్నారు. ప్రతి ఒక్కరూ సత్ప్రవర్తన కలిగి ఉండి భగవంతుడి ఆశీస్సులు పొందాలని కోరారు. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఆలయ పునర్నిర్మాణానికి ఐదు లక్షల ఆర్థిక సహాయం అందించినట్లు ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. వారితో పాటు మాల్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ దంటు జగదీశ్వర్, మాజీ ఎంపీపీ అనంత రాజు గౌడ్, మాజీ వైస్ ఎంపీపీ కట్కూరి వెంకటేష్ గౌడ్, రైతుబంధు సమితి మండల మాజీ అధ్యక్షుడు బచ్చు రామకృష్ణ, సహకార సంఘం చైర్మన్లు పందుల యాదయ్య గౌడ్, బాలం నరసింహా మాజీ ఎంపీటీసీలు ఊరి పక్క సరిత నగేష్, మారగోని రామన్న మాజీ సర్పంచులు చెరుకు లింగం గౌడ్, ఐలి లక్ష్మీనరసింహ, సీనియర్ నాయకుడు రామిడి వెంకట రమణ రెడ్డి,గ్రామ శాఖ అధ్యక్షుడు ముద్దం శ్రీనివాస్ గౌడ్. మల్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ జమ్ముల వెంకటేష్ గౌడ్,,పెద్ద గౌడ్ కుకూడపు యాదయ్య గౌడ్, రాములు గౌడ్, శ్రీనివాస్ గౌడ్, వెంకట్ రమణ గౌడ్, రాఘవేందర్ గౌడ్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.
పూజా కార్యక్రమంలో పాల్గొన్న బిఆర్ఎస్ పార్టీ భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం ఇన్చార్జి క్యామ మల్లేష్ తదితరులు
ఈ కార్యక్రమానికి హాజరైన నాయకులను గౌడ సంఘం పెద్దలు శాలువాలతో సన్మానించారు. అనంతరం బీఆర్ఎస్ యువజన నాయకుడు వల్లంల విమలసంతోష్ యాదవ్ దంపతుల ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం చేశారు.
బీఆర్ఎస్ యువజన నాయకుడు వల్లంల విమలసంతోష్ యాదవ్ దంపతుల ఆధ్వర్యంలో అన్నదానం
ఈ కార్యక్రమంలో శ్రీ కంఠమహేశ్వర స్వామి ఉత్సవ కమిటీ సభ్యులు, గౌడ సంఘం నాయకులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.