Suryapet News : ఆచార్యుల గూడెం వాసికి డాక్టరేట్ 

స్ప్రింగ్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ నుండి సామాజిక సేవా విభాగంలో డాక్టరేట్

On
Suryapet News : ఆచార్యుల గూడెం వాసికి డాక్టరేట్ 

డాక్టరేట్ గౌరవ ప్రదానాన్ని స్వీకరిస్తున్న ఆచార్య గూడెం వాసి మొలుగూరి నాగరాజు

ఆచార్యుల గూడెం వాసికి డాక్టరేట్ 

చిలుకూరు (ప్రభాత సూర్యుడు) 

చిలుకూరు మండలం ఆచార్యుల గూడెం కి చెందిన మొలుగూరి నాగరాజు కి యూఎస్ఏ యునైటెడ్ స్టేట్స్ ఆప్ అమెరికాకు చెందిన డే స్ప్రింగ్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ వారు సామాజిక సేవ విభాగంలో మొలుగురు నాగరాజుకి డాక్టరేట్ ప్రధానం చేశారు. ములుగురు నాగరాజు అతి సామాన్య కూలి చేసుకునే కుటుంబంలో పుట్టినప్పటికీ విద్యార్థి దశ నుండే వామపక్ష భావజాలంతో ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘంలో విద్యార్థి నాయకుడిగా, విద్యారంగ సమస్యలపై సమరశీల పోరాటాలు చేసి మంచి నాయకత్వ లక్షణాలు అలవర్చుకున్నారు. అప్పటినుండి ప్రతి ఒక్కరికి ఎంతో కొంత తన వంతు సహాయం చేయాలనే ఉద్దేశంతో ముందుకు సాగేవారు. అందులో భాగంగానే 13 సంవత్సరాల క్రితం ఆలోచన ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సేవా సంస్థను స్థాపించి మొదటిగా ఆడపిల్లలను పుట్టనిద్దాం ,ఆడపిల్లను చదవనిద్దాం,ఆడపిల్లను ఎదగనిద్దాం అనే నినాదంతోబ్రూణ హత్యలకు వ్యతిరేకంగా పోస్టర్లు ముద్రించి ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మహిళా మంత్రులైన సబితా ఇంద్రారెడ్డి డీకే అరుణ ఉత్తంకుమార్ రెడ్డి భట్టి విక్రమార్క గారి చేతుల మీదుగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో పోస్టర్ ఆవిష్కరణ చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన సదస్సులు నిర్వహించి ఆనాటి ఉన్నతాధికారులతో ప్రశంసలు పొం దటం జరిగింది. ఉద్యోగాలకు కోచింగ్, వైద్యం, ఉచిత కంటివైద్య శిబిరం, వంటి అనేక కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. ఆలోచన ఫౌండేషన్ ప్రాజెక్టు రిపోర్ట్స్ ను పరిశీలించిన డే స్ప్రింగ్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ వారు ఈ సంవత్సరం తెలంగాణ రాష్ట్రం నుండి వివిధ రంగాలలో ప్రావీణ్యం సాధించిన ముగ్గురిలో ఒకరిగా మొలుగురు నాగరాజు కి ఆ గౌరవం దక్కింది. ఆచార్యుల గూడెం గ్రామం నుండి మొదటగా డాక్టరేట్ పొందిన వ్యక్తిగా నాగరాజు గారికి గ్రామ స్తులు అభినందించారు.

Read More AP News : వైఎస్సార్ జిల్లా పేరు మార్పు 

Views: 5
Tags:

Related Posts

Latest News