Telangana ACB : పట్టుబడ్డ రెవిన్యూ అవినీతి జలగలు 

రెవెన్యూ శాఖలో ఒకే రోజు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ ఇద్దరు అవినీతి రెవిన్యూ ఇన్స్పెక్టర్లు

On
Telangana ACB : పట్టుబడ్డ రెవిన్యూ అవినీతి జలగలు 

పట్టుబడ్డ రెవిన్యూ అవినీతి జలగలు 

  • రెవెన్యూ శాఖలో ఒకే రోజు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ ఇద్దరు అవినీతి రెవిన్యూ ఇన్స్పెక్టర్లు

తెలంగాణ - ప్రభాత సూర్యుడు 

ప్రభుత్వాలు ఏవైనా ప్రభుత్వ అధికారులు మాత్రం అవినీతి దందా మానుకోవడం లేదు. ప్రభుత్వం ఎన్ని కఠిన ఆంక్షలు విధించిన తెలంగాణ రాష్ట్రంలో ఏ మూలకు ఒకచోట అవినీతి అధికారుల భాగోతం బయటపడుతుంది. తాజాగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలోని ఇద్దరు అవినీతి రెవిన్యూ అధికారులను ఒకేరోజు ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. 

Read More Jr NTR : దాదాసాహెబ్‌ ఫాల్కే బయోపిక్‌లో ఎన్టీఆర్‌ ?

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం తహసిల్దార్ కార్యాలయంలో..

Read More KTR vs Kavitha: ఎమ్మెల్సీ కవితకు షోకాజ్ నోటీసులు❓

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం తహసీల్దార్ కార్యాలయంలో రెవిన్యూ ఇన్స్పెక్టర్ గా పని చేస్తున్న జి కృష్ణ ను ఏసీబీ అధికారులు బుధవారం అరెస్టు చేశారు. ఇబ్రహీంపట్నం మండలంలోని ఆదిభట్ల గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 355 కు సంబంధించిన ఏడు గుంటల భూమి బదలాయించడానికి ఆర్ ఐ కృష్ణ 12 లక్షల రూపాయలను డిమాండ్ చేశాడు. ఇదే విషయం లో ఫిర్యాదుదారు నుండి ఏసీబీ అధికారులకు ఫిర్యాదులు ఇబ్రహీంపట్నం తాసిల్దార్ కార్యాలయంలో ఆకస్మిక దాడులు నిర్వహించి, ఆర్ ఐ కృష్ణను అరెస్టు చేశారు. IMG-20250528-WA0029

Read More Indiramma Indlu : దసరా నాటికి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పూర్తి చేసుకోండి

IMG-20250528-WA0030

ముషీరాబాద్ తాసిల్దార్ కార్యాలయంలో..

హైదరాబాద్ జిల్లా ముషీరాబాద్ తహసిల్దార్ కార్యాలయంలో రెవిన్యూ ఇన్స్పెక్టర్ గా పని చేస్తున్న భూపాల మహేష్ ను సిటీ రేంజ్ Unit - 2 ఏసీబీ అధికారులు 25వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ మంజూరికై ఆర్ ఐ భూపాల మహేష్ బాధితుని వద్ద లక్ష రూపాయలు డిమాండ్ చేసి ఒప్పందం కుదుర్చుకున్నాడు. అందులో భాగంగా మొదటి విడతలో ఫిర్యాదుదారుని నుండి ఆర్ ఐ మహేష్ 25 వేల రూపాయలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

IMG-20250528-WA0021

ఈ మేరకు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ కృష్ణ ను, హైదరాబాద్ జిల్లా ముషీరాబాద్ మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ భూపాల మహేష్ను అరెస్టు చేసి నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరు పరిచినట్లు ఏసీబీ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.

Views: 42

Latest News