TTD News : ఎస్వీబీసీ ఛానల్ ప్రక్షాళన కు అధ్యయన బృందం 

On
TTD News : ఎస్వీబీసీ ఛానల్ ప్రక్షాళన కు అధ్యయన బృందం 

ఎస్వీబీసీ ఛానల్ ప్రక్షాళన కు అధ్యయన బృందం 

తిరుపతి - ప్రభాత సూర్యుడు

తిరుమల తిరుపతి దేవస్థానం అనుసంధానంతో నడుస్తున్న శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ సంస్థను మరింత పటిష్టవంతంగా తీర్చిదిద్ది, భవిష్యత్తులో భక్తి ఛానల్ లకు మార్గదర్శకంగా ఉండేలా రూపురేఖలు మార్చేందుకు ప్రణాళిక సిద్ధమైంది. కోట్లాది రూపాయల నిధులు కేటాయిస్తున్నప్పటికీ క్వాలిటీ లేని కార్యక్రమాలతో భక్తులను సరైన రీతిలో ఆకట్టుకోలేక పోతున్నట్లు విమర్శలు ఎదుర్కొంటున్న ఎస్వీబీసీ ఛానల్ ను గాడిలో పెట్టేందుకు ప్రత్యేకంగా అనుభవజ్ఞులు నిపుణుల చేత విచారణ జరిపి ఒక నివేదిక అందించాలని టిటిడి పాలకమండలి ఆదేశించింది. 

Click Here to Read More👉 Lashkar Bonalu : నేటి నుంచి ఆషాఢ మాసం బోనాలు

 ఈ మేరకు ఢిల్లీ, హైదరాబాదుల నుండి ఒక ప్రత్యేక నిపుణుల బృందం ఇప్పటికే తిరుపతికి చేరుకుంది. మూడు రోజులపాటు తిరుపతి తిరుమల లో బసచేయనున్న ఈ ప్రత్యేక కమిటీ సభ్యులు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ లో అమలవుతున్న కార్యక్రమాలు, పరిపాలన వ్యవహారాలు, సిబ్బంది పనితీరు, కార్యక్రమాల రూపకల్పన, ప్రసారం చేస్తున్న కార్యక్రమాలలో నాణ్యత, భక్తి కార్యక్రమాల పేరుతో ఖర్చు చేస్తున్న నిధుల‌ సద్వినియోగం, సిబ్బంది విధి నిర్వహణ తీరు వ్యవహారాలు, తదితర అంశాలపై క్షుణ్ణంగా అధ్యయనం చేసి టీటీడీ బోర్డుకు నివేదిక అందించనున్నారు. పలు జాతీయ టీవీ ఛానల్ నిర్వహణ వ్యవహారాలు పై మంచి అనుభవం కలిగిన నిపుణులను ఈ అధ్యయనానికి నియమించినట్లు టిటిడి వర్గాలు వెల్లడించాయి. 

Click Here to Read More👉 Kavitha Liquor Scam : ఈడీ సైలెంట్ ఆపరేషన్.. లిక్కర్ స్కామ్‌లో అసలు ప్రకంపనలు స్టార్ట్

గత వైసిపి ప్రభుత్వ హయాంలో టీటీడీలోని కీలక అధికార పదవులు అన్నింటిని సర్వం తానే అని వ్యవహరించిన అధికారి ఎస్ వి బి సి ఛానల్ కు కూడా తానే అధిపతిగా భావించి దాతలు టీటీడీకి అందించిన కోట్లాది రూపాయల నిధులను పక్కదారి పట్టించి ఎస్వీబీసీ ఛానల్ లో కార్యక్రమాల ఖర్చు పేరుతో నిధులను దారి మళ్లించినట్లు వచ్చిన ఆరోపణలపై కూడా పూర్తిస్థాయిలో అధ్యయనం చేయనున్నారు. నూతనంగా అందనున్న నివేదిక ప్రకారం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ రూపు రేఖలను మార్చడంతో పాటు జాతీయస్థాయిలో ఛానల్ కు గుర్తింపు తీసుకొచ్చి, నిధుల వినియోగంలో దుర్వినియోగాన్ని అరికట్టి, ప్రభుత్వం నుండి ఛానల్ నిర్వహణ కోసం అనుభవం కలిగిన పర్యవేక్షకులను నియమించేలా టిటిడి బోర్డు కీలకమైన చర్యలు తీసుకోవడానికి ఉపక్రమించింది.

Click Here to Read More👉 Lok Sabha : అన్ని రాష్ట్రాల్లో లోక్‌సభ సీట్లు 20 శాతం పెంపు

Views: 36

Latest News

Bonalu Festivel : లాల్‌దర్వాజ బోనాల ఉత్సవాల్లో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రత్యేక పూజలు Bonalu Festivel : లాల్‌దర్వాజ బోనాల ఉత్సవాల్లో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రత్యేక పూజలు
లాల్‌దర్వాజ బోనాల ఉత్సవాల్లో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రత్యేక పూజలు హైదరాబాద్ - ప్రభాత సూర్యుడు పాతబస్తీ లాల్‌దర్వాజ బోనాల ఉత్సవాలు అత్యంత వైభవంగా...
Karnataka Crime : కర్ణాటకలో కీచక ఉపాధ్యాయులు 
Mahalaxmi Scheme : త్వరలో తెలంగాణ మహిళలకు ప్రతినెల 2,500
DM&HO RRD : మెడికల్ ఆఫీసర్ల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం 
MLC Kavitha : ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆఫీస్ పై దాడి 
BJP Rajasingh : 11 సంవత్సరాల శ్రమకు దక్కిన గొప్ప గౌరవం
Indiramma Canteen : 5 రూపాయలకే కడుపు నిండా భోజనం