Ibrahimpatnam constituency : ప్రభుత్వ భూములను కబ్జా చేస్తే కఠిన చర్యలు 

మీడియా సమావేశంలో తహసిల్దార్ బి సుదర్శన్ రెడ్డి హెచ్చరిక

On
Ibrahimpatnam constituency : ప్రభుత్వ భూములను కబ్జా చేస్తే కఠిన చర్యలు 

ప్రభుత్వ భూములను కబ్జా చేస్తే కఠిన చర్యలు 

  • ఎమ్మెల్యే అనుచరులమంటూ కబ్జాలకు పాల్పడితే సహించం 
  • ప్రభుత్వ భూముల పరిరక్షణకు ప్రత్యేక నిఘా 
  • మండల పరిధిలోని ప్రభుత్వ భూములను గుర్తించి ఫెన్సింగ్ ఏర్పాటు
  • మీడియా సమావేశంలో తహసిల్దార్ బి సుదర్శన్ రెడ్డి హెచ్చరిక

అబ్దుల్లాపూర్ మెట్ – ప్రభాత సూర్యుడు 

కాంగ్రెస్ పేరు చెప్పుకొని, ఎమ్మెల్యే అనుచరలమని ప్రభుత్వ భూముల కబ్జాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని అబ్దుల్లాపూర్మెట్ మండల తహసిల్దార్ బి.సుదర్శన్ రెడ్డి హెచ్చరించారు. సోమవారం తహసిల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక మీడియా సమావేశంలో సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ.. అధికార పలుకుబడితో, కాంగ్రెస్ నాయకులమని చెప్పుకుంటూ, ఎమ్మెల్యే పేరున అడ్డం పెట్టుకుని భూ కబ్జాలకు పాల్పడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని అన్నారు. మండల పరిధిలోని బాట సింగారం సర్వే నెంబర్ 10/95, 10/96 ప్రభుత్వ భూమిలో కబ్జాల వ్యవహారంపై తహసిల్దార్ సుదర్శన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి ప్రభుత్వ భూముల కబ్జాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని అన్నారు. ఎమ్మెల్యే, కలెక్టర్ల ఆదేశాలనుసారం.. అబ్దుల్లాపూర్ మెట్టు మండల పరిధిలోని ప్రభుత్వ భూములపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. మండల పరిధిలో 865.11 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని, అందులో 379.25 ఎకరాల విస్తీర్ణంలో ప్రభుత్వ భూమి ఖాళీగా ఉందని, దానిని పరిరక్షించేందుకు హద్దులను గుర్తించి ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తామని తెలిపారు.Screenshot_20250520_113300

Read More MLA Gandra Satyanarayana Rao : ఆర్ఎంపీ డాక్టర్ల ఆధ్వర్యంలో తిరంగా యాత్ర

 బాట సింగారం గ్రామంలో సర్వే నెంబర్ 10/95 10/96 ప్రభుత్వ భూమిలో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి పేరుతో ఏర్పాటు చేసిన ఆర్చ్

Read More CJI Justice BR Gavai : నువ్వు ముఖ్యమంత్రివైతే అంతా నీ ఇష్టమేనా..?

మండల పరిధిలోని ప్రతి గ్రామంలో ప్రభుత్వ భూములను గుర్తించి, సర్వే నిర్వహించి హద్దులను, ఫెన్సింగ్ లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటికే కుంట్లూరు, తట్టి అన్నారం రెవిన్యూ గ్రామాలలో సర్వే నిర్వహించి ప్రభుత్వ భూములను గుర్తించామని, త్వరలో ఫెన్సింగ్లు ఏర్పాటు చేస్తామని వివరించారు. అదేవిధంగా తుర్కయంజాల్, తారామతి పేట, పసుమామల, అనాజ్పూర్ తదితర గ్రామాలలో సర్వే ప్రక్రియ మొదలైందని త్వరలోనే అక్కడి ప్రభుత్వ భూములకు కూడా హద్దులను ఏర్పాటు చేస్తామని తెలిపారు. తక్కువ విస్తీర్ణం ఉన్న ప్రభుత్వ భూములలో ఫెన్సింగ్ లను ఏర్పాటు చేస్తామని, ఎక్కువ విస్తీర్ణం ఉన్న ప్రభుత్వ భూములకు హద్దులను ఏర్పాటు చేస్తామని వివరించారు.Screenshot_20250520_113346

Read More Rachakonda Police : అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ ఇన్స్పెక్టర్ గా వి. అశోక్ రెడ్డి 

ఎమ్మెల్యే అనుచరులమనీ బాట సింగారం రామం సర్వే నం .10/95 10/96 ప్రభుత్వ భూమిని ఆక్రమించి, చదును చేసి అక్రమ వెంచర్లు చేస్తున్న దృశ్యం

అనాజ్ పూర్ గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 281 పై భూ అక్రమనల ఫిర్యాదులు రావడంతో సమగ్ర సర్వే సర్వే నిర్వహించగా 92 ఎకరాల సీలింగ్ భూమి ఉన్నట్లు తేలిందని, మిగతాది పట్టా పట్టా భూమి ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. ఇదే సర్వే నెంబర్లు వేముల కత్వ, ఇందిరమ్మ సాగరల బఫర్ జోన్లను ఆక్రమించి చేస్తున్న వెంచర్ నిర్వాహకులపై భూఆక్రమణల ఫిర్యాదులు రావడంతో ఇరిగేషన్, రెవిన్యూ శాఖల సంయుక్తంగా సర్వే నిర్వహించి ఉన్నతాధికారులకు నివేదిక పంపించామని వివరించారు. IMG-20250517-WA0051

 ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూమిలో అక్రమ కట్టడాలను కూల్చివేసిన రెవిన్యూ సిబ్బంది

సమస్యాత్మకంగా మారిన బాట సింగారం సర్వే నెంబర్ 10/95, 10/96 ప్రభుత్వ భూమిలో నిర్మించిన అక్రమ నిర్మాణాలను ఇప్పటికే కూల్ చేశామని, ఈ భూముల్లో ఎమ్మెల్యే హస్తముందని వస్తున్న ఆరోపణలు అవాస్తవమని, ఇప్పటికే ప్రభుత్వ భూముల కబ్జాలకు గురైతే తగిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే, కలెక్టర్ ఆదేశాలు ఉన్నట్లు వివరించారు. ప్రభుత్వ భూములకు కబ్జాలపై ఇప్పటికే ప్రభుత్వం సీరియస్ గా ఉందని, ఎవరైనా ప్రభుత్వ భూములకు కబ్జాలకు పాల్పడితే కఠిన చర్యలు చేపట్టి, క్రిమినల్ కేసులు పెడతామని ఈ సందర్భంగా తహసిల్దార్ సుదర్శన్ రెడ్డి హెచ్చరించారు.IMG-20250517-WA0042

కబ్జాకు గురైన ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకొని సూచిక బోర్డును నాటిన రెవిన్యూ అధికారులు సిబ్బంది

Views: 78

Latest News