Telangana Cabinet : 6 మంత్రి పదవుల్లో ముగ్గురికి బెర్త్ కన్షామ్.. 3 పెండింగ్

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డిలకు మిగిలిన నిరాశ

On
Telangana Cabinet : 6 మంత్రి పదవుల్లో ముగ్గురికి బెర్త్ కన్షామ్.. 3 పెండింగ్

నూతనంగా మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న గడ్డం వివేక్, అడ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరి

తెలంగాణ క్యాబినెట్ లోకి మరో ముగ్గురు

  • వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరి పేర్లు ఖరారు
  • నేడు మధ్యాహ్నం గంటల తర్వాత ప్రమాణ స్వీకారం 
  • ప్రమాణ స్వీకారం కోసం రాజ్ భవన్ లో ఏర్పాటు 
  • ఢిల్లీ నుంచి హైదరాబాద్కు చేరుకున్న గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ

హైదరాబాద్ – ప్రభాత సూర్యుడు 

తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారు అయింది. కాంగ్రెస్ హై కమాండ్ ఓకే చెప్పడంతో తెలంగాణ క్యాబినెట్ లోకి మంత్రులుగా మరో ముగ్గురు రానున్నారు. నేడు మృగశిర కార్తి మంచి రోజు కావడంతో మధ్యాహ్నం 12 గంటల తర్వాత ప్రమాణస్వీకారం చేయించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రమాణ స్వీకార ఏర్పాట్ల కోసం రాజ్ భవన్ లో పనులు కొనసాగుతున్నాయి. మంత్రులుగా ఖరారైన వారిలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ( ఎస్సీ మాల ), ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్  ( ఎస్సీ మాదిగ ), మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ( బిసి ముదిరాజ్ ) లు ఉన్నారు. ఈ ముగ్గురి పేర్లను కాంగ్రెస్ హై కమాండ్ శనివారం అర్ధరాత్రి తర్వాత ఖరారు చేసింది. ఈ ముగ్గురితో ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు రాజ్ భవన్ లో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఈ మేరకు రాజ్ భవన్ వర్గాలు ప్రమాణ స్వీకార ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. మంత్రివర్గంలో చోటు తక్కిన ముగ్గురు ఎమ్మెల్యేలకు ఈ ఆదివారం ఉదయం సీఎంఓ నుంచి ఫోన్ ద్వారా సమాచారం వెళ్లనుంది. 
రాష్ట్ర క్యాబినెట్లో మొత్తం ఆరు వ్యక్తులు ఖాళీగా ఉండగా., ప్రస్తుతం మూడు భక్తులను భర్తీ చేస్తున్నారు. మిగిలిన మూడు వ్యక్తులను త్వరలో భర్తీ భర్తీ చేయనున్నట్లు ఏఐసీసీ వర్గాలు వెల్లడించాయి. ఢిల్లీలో ఉన్న గవర్నర్ విష్ణుదేవ్ వర్మ శనివారం రాత్రి ఢిల్లీ నుంచి హైదరాబాద్కు బయలుదేరారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో సమావేశమై.. క్యాబినెట్ విస్తరణ పై చర్చించారు. అనంతరం ఈ విషయాన్ని పార్టీ ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్ కు తెలిపిన తర్వాత, ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున కార్గే, అగ్ర నేత రాహుల్ గాంధీ చర్చించి తుది నిర్ణయం తీసుకున్నారు.

Read More AP News : వైఎస్సార్ జిల్లా పేరు మార్పు 

Views: 60

Latest News