Betting Apps : తెలుగు రాష్ట్రాల్లో వీడో మరో హర్షద్ మెహతా..!

తీగ లాగితే డొంక కదిలి నట్లు.. దిమ్మ తిరిగే నిజాలు.. హర్ష సాయి 500 కోట్ల బిగ్ డీల్

On
Betting Apps : తెలుగు రాష్ట్రాల్లో వీడో మరో హర్షద్ మెహతా..!

Shocking facts.. Harsha Sai's 500 crore big deal scam

బెట్టింగ్‌ యాప్స్‌ ద్వారా 500 కోట్లు లూటీ చేస్తున్నసెలబ్రిటీస్‌ !

హైదరాబాద్‌ - ప్రభాత సూర్యుడు

పోలీస్‌ డిపార్ట్మెంట్‌ బెట్టింగ్‌ యాప్స్‌ ని ప్రమోట్‌ చేస్తున్న సెలెబ్రిటీలపై చాలా తీవ్రమైన యాక్షన్‌ తీసుకోవడానికి సిద్ధంగా ఉంది. ఇప్పటికే హర్ష సా, బన్నీ సన్నీ యాదవ్‌ వంటి వారి కోసం గాలింపు చర్యలు మొదలు పెట్టారు. త్వరలోనే యాంకర్‌ శ్యామల, బిగ్‌ బాస్‌ కంటెస్టెంట్స్‌ విష్ణు ప్రియ, టేస్టీ తేజ వంటి వారిపై పోలీసులు కేసు నమోదు చేసారు. వీరితో పాటు రీతూ చౌదరి, కిరణ్‌ గౌడ్‌, పరేషాన్‌ బాయ్స్‌ ఇమ్రాన్‌, ఇలా మొత్తం విూద 11 మంది టాప్‌ సెలబ్రిటీస్‌ పై కేసులు నమోదు చేసారు.

Click Here to Read More👉 TPCC : మల్రెడ్డి రంగారెడ్డికి చెక్..? స్పీకర్ గడ్డం ప్రసాద్ కు మంత్రివర్గంలో బెర్త్..!

https://youtu.be/tiHGXaGDLrU

Click Here to Read More👉 TG TET Hall Tickets : అందుబాటులోకి తెలంగాణ టెట్‌ హాల్‌ టికెట్లు..ఇలా డౌన్‌లోడ్‌ చేసుకోండి

వీరిపై త్వరలోనే కఠినమైన యాక్షన్‌ తీసుకునే అవకాశం ఉంది. చిన్న పిల్లల జీవితాలతో ఆడుకునే ఇలాంటి మహమ్మారి యాప్స్‌ ని ప్రమోట్‌ చేయడం చాలా తప్పు కదా, సెలెబ్రిటీస్‌ తప్పు అని తెలిసి కూడా ఎందుకు ప్రమోట్‌ చేస్తున్నారు అంటే, అందుకు కారణం డబ్బు. ఒక సినిమా లేదా ఒక సీరియల్‌ చేస్తే వీళ్లకు ఎన్ని కోట్లు వస్తాయో తెలియదు కానీ, బెట్టింగ్‌ యాప్స్‌ కి ప్రమోట్‌ చేస్తే 500 కోట్ల రూపాయిల వరకు సంపాదించుకోవచ్చు అట. హర్ష సాయి అలా 500 కోట్ల రూపాయిల డీల్‌ ని రీసెంట్‌ గానే కుదురించుకున్నాడట.Screenshot 2025-03-18 215542 ఇతనికి యూట్యూబ్‌ లో కోటి మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఇక ఆ రేంజ్‌ లో రెమ్యూనరేషన్‌ డిమాండ్‌ చేయకుండా ఎందుకు ఉంటాడు చెప్పండి?, ఇవన్నీ పోలీస్‌ డిపార్ట్మెంట్‌ దృష్టికి వెళ్లడంతో వెంటనే యాక్షన్‌ తీసుకోవడం మొదలు పెట్టారు. కేసు ఇలా నమోదు అయ్యింది, అలా ఇన్‌ స్టాగ్రామ్‌ అకౌంట్‌ రీతూ చౌదరి ‘చసే నో టూ బెట్టింగ్‌ యాప్స్‌’ అంటూ ఒక వీడియో ని చేసి అప్లోడ్‌ చేసింది. ముందు నుండే ఇలాంటి క్యాంపైన్స్‌ ఎందుకు రన్‌ చేయలేదు?, దెబ్బ పడితే కానీ నొప్పి తెలియలేదు అన్నమాట. ఇప్పుడు దీనిపై ఫుల్‌ నెగటివ్‌ క్యాంపైన్‌ నడుస్తుంది కాబట్టి, ఎవ్వరూ చేయడం లేదు, భవిష్యత్తులో వేడి తగ్గిన తర్వాత మళ్ళీ బెట్టింగ్‌ యాప్స్‌ ని ప్రమోట్‌ చేయరని గ్యారంటీ ఏమిటి. డబ్బు మనిషి చేత ఎలాంటి పనిని అయినా చేయిస్తుంది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా పోలీసుల చర్యలు ఎలా ఉండబోతున్నాయి అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారిన అంశం.

Click Here to Read More👉 Sefety In Private Schools : ప్రైవేటు బడుల్లో విద్యార్థులు భద్రమేనా..?

Views: 111

Latest News