Singareni : సింగరేణి కొత్త చరిత్ర

13 దశాబ్దాల చరిత్రలో తొలిసారిగా ఇతర రాష్ట్రంలోకి సింగరేణి సంస్థ అడుగు

On
Singareni : సింగరేణి కొత్త చరిత్ర

Singareni Naini coal block has been started in Odisha. For the first time in its 13-decade history, Singareni has entered another state.

సింగరేణి కొత్త చరిత్ర

హైదరాబాద్‌ - ప్రభాత సూర్యుడు

ఒడిశాలో సింగరేణి నైనీ బొగ్గు బ్లాక్‌ ప్రారంభమైంది. 13 దశాబ్దాల చరిత్రలో తొలిసారిగా ఇతర రాష్ట్రంలోకి సింగరేణి సంస్థ అడుగుపెట్టింది. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రం వరకే పరిమితమై బొగ్గు గనులు నిర్వహిస్తున్న సింగరేణి ఇప్పుడు నైనీ బొగ్గు బ్లాక్‌ ద్వారా ఇతర రాష్ట్రాల్లోకి అడుగు పెట్టినట్లు అయింది. ఇదోక ఒక చరిత్రాత్మక ఘట్టంగా అధికారులు పేర్కొన్నారు. 2016 మే నెలలో ఈ గనిని కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ సింగరేణికి కేటాయించింది. అన్ని రకాల అనుమతులు సాధించినప్పటికీ? తవ్వకం ప్రారంభించడానికి తొమ్మిదేళ్ళ సుదీర్ఘ కాలం నిరీక్షించాల్సి వచ్చింది. ఇటీవలే కాలంలో ప్రభుత్వం ఈ తవ్వకాల విషయంలో మరింత దృష్టి పెట్టడంతో లైన్‌ క్లియర్‌ అయిపోయింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో అధికారులు ఒడిశా రాష్ట్రంలో ప్రత్యేకంగా పర్యటించి.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితోనూ, సంబంధిత అధికారులతోనూ సంప్రదింపులు జరిపారు. గని ప్రారంభానికి మార్గం సుగమం చేశారు. Singareni-RG-1-mine-registers-record-coal-production-of-18144-tonnes-in-single-dayరాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ వల్ల సింగరేణికి అతిపెద్ద బొగ్గు బ్లాక్‌ లభించింది. తద్వారా వార్షిక అధికోత్పత్తి సాధనకు మార్గం సుగమమై సంస్థ ఆర్థిక పటిష్టతకు దోహదపడనుంది.సింగరేణి సంస్థ చరిత్రలో మొదటిసారి బయటి రాష్ట్రంలో బొగ్గు తవ్వకాలు ప్రారంభించడం అభినందనీయమని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అన్నారు. దాదాపు 136 ఏళ్లుగా తవ్వకాలు సాగిస్తూ రాష్ట్రానికి వెలుగులు పంచుతున్న తెలంగాణ సింగరేణి? రాష్ట్రం బయట ఒడిశాలోని నైనీ బొగ్గు బ్లాకులో తవ్వకాలు ప్రారంభించి భవిష్యత్తు తరాలకు బంగారు బాటలు వేసిందని పేర్కొన్నారు.సింగరేణి కోసం ప్రజా ప్రభుత్వం తీసుకుంటున్న ప్రత్యేక చొరవ వల్లే తొలిసారి దేశంలోని ఇతర రాష్ట్రంలోనూ బొగ్గు గనిని ప్రారంభించడం సాధ్యమైందని వ్యాఖ్యానించారు. ఇది మా ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని అన్నారు.

Click Here to Read More👉 79th Indipendent : ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

ఒడిశాలోని అంగుల్‌ జిల్లాలోని నైనీ గని ప్రారంభించడం ద్వారా సింగరేణి కొత్త శకానికి నాంది పలికిందని ముఖ్యమంత్రి ఒక సందేశంలో పేర్కొన్నారు.నైనీ బొగ్గు గనులకు అన్ని అనుమతులు సాధించి అందులో తవ్వకాలు ప్రారంభించిన చారిత్రక ఘట్టం సాకారం కావడం తెలంగాణ ప్రజలందరికీ గర్వకారణమని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. తెలంగాణకు మణిమకుటంగా, వేలాది కార్మిక కుటుంబాలకు జీవనాధానంగా నిలుస్తున్న సింగరేణి సంస్థ అభివృద్ధికి? విస్తరణకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి? సింగరేణి సంస్థకు అభినందనలు తెలియజేశారు.

Click Here to Read More👉 Narayana's NOVOUS Event : నృత్య ప్రదర్శనతో ఆకట్టుకున్న కుమారి షర్మిల భార్గవి

Views: 41

Latest News

Narayana's NOVOUS Event : నృత్య ప్రదర్శనతో ఆకట్టుకున్న కుమారి షర్మిల భార్గవి Narayana's NOVOUS Event : నృత్య ప్రదర్శనతో ఆకట్టుకున్న కుమారి షర్మిల భార్గవి
నృత్య ప్రదర్శనతో ఆకట్టుకున్న కుమారి షర్మిల భార్గవి చైతన్యపురి నారాయణ కాలేజీలో ఘనంగా ఫ్రెషర్స్ డే వేడుకలు  అద్భుత నృత్య ప్రదర్శనతో షర్మిల భార్గవికి ప్రశంసల వెల్లువ...
79th Indipendent : ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
Achampet News : అచ్చంపేట్ కాంగ్రెస్ కు గట్టి షాక్
Rangareddy News : రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ గా  కె చంద్రా రెడ్డి బాధ్యతలు
Rangareddy News : ప్రణాళిక బద్దంగా జాతీయ నులిపురుగుల దినోత్సవం నిర్వహించాలి
CM Relief Fund : పేదలకు అండగా ముఖ్యమంత్రి సహాయ నిధి
Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసులో U టర్న్ తీసుకున్న RS ప్రవీణ్ కుమార్