Sefety In Private Schools : ప్రైవేటు బడుల్లో విద్యార్థులు భద్రమేనా..?
గాలిలో దీపంలా విద్యార్దుల భద్రత - అన్నీ తెలిసి కూడా పట్టించుకోని విద్యా శాఖ అధికారులు
.jpg)
తెలంగాణలో అమలుకు నోచుకోని Right To Education (RTE) Act
Not Implementation of Section 12(1)(c) of the RTE Act
ప్రైవేటు బడుల్లో విద్యార్థులు భద్రమేనా..?
- అపార్టుమెంటుల్లో, ఇరుకు గదుల్లో తరగతుల నిర్వహణ
- కనీస క్రీడా మైదానం కూడా లేని స్కూళ్ళకు అనుమతులు
- విద్యా బోధన మినహా ఆటలకు, శారీరక దారుడ్యానికి లేని ప్రాధాన్యం
- పాఠశాలల్లో కరువైన కనీస మౌళిక వసతు
- సెల్లార్లలో సూళ్ళ నిర్వహణ, ఇరకు తరగతుల్లో విద్యా బోధన
- గాలిలో దీపంలా విద్యార్దుల భద్రత
- అన్నీ తెలిసి కూడా పట్టించుకోని విద్యా శాఖ అధికారులు
రంగారెడ్డి జిల్లా - ప్రభాత సూర్యుడు
ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థుల నుంచి వేలకు వేలు ఫీజులు దండుకునే విషయంలో ఉన్నంత శ్రద్ధ వారికి మౌలిక వసతులను కల్పించడంలో లేదనే చెప్పాలి. విద్యార్థులకు ఆటపాటలను అటుంచితే.. మలమూత్రాలను కూడా ప్రశాంతంగా విసర్జించని పరిస్థితి దాపురించింది. ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల యాజమాన్యాలు విద్యకు మినహా ఆటలకు, విద్యార్థుల భద్రతకు ఏమాత్రం ప్రాధాన్యం ఇవ్వడం లేదనే ఆరోపణలు మెండుగా ఉన్నాయి.
👆 హయత్ నగర్ వినాయక నగర్ కాలనీలో ఆట మైదానం లోకుండానే అపార్ట్మెంట్ భవనంలో నూతనంగా ప్రారంభించిన పల్లవి పాఠశాల
అపార్టుమెంట్లు, ఇరుకు గదుల్లో తరగతులను నిర్వహిస్తూ విద్యార్థుల భద్రతను గాలికొదిలేస్తున్నారు. పిల్లల ప్రాణాలను గాలిలో దీపంలాగా పెడుతున్నారు. జిల్లాలో చాలా ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలను ఇరుకు గదులు, వ్యాపార సంస్థలు, అపార్టుమెంట్లలో నడుపుతున్నారు. రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా సుమారు 5000 లకు పైగా గుర్తింపు పొందిన, గుర్తింపు లేనటువంటి ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలున్నాయి. వీటిలో అధికశాతం ఇరుకుగదుల్లోనే తరగతులను నిర్వహిస్తున్నారు. ఏదైనా సమస్య రానంత వరకూ బాగానే ఉంటుంది. ఏదైనా జరగరాని ప్రమాదం జరిగితే మాత్రం భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని విద్యావేత్తలు విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
భద్రతా ప్రమాణాలు లేకున్నా అనుమతులకు ఓకే..!
ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతి పాఠశాల ఏర్పాటుకు ముందు అగ్నిమాపక శాఖ నుంచి ఫైర్ సేఫ్టీ సర్టిఫికెట్ పొందాలి. భవనం నిర్మాణ అనుమతులను పరిశీలించాలి. సంబంధిత శాఖ అధికారులు భవనం అనుకూలతను పరిశీలించి అనువుగా ఉంటేనే ధ్రువీకరించాలి. కానీ నిబంధనలకు అనుగుణంగా లేకపోయినా ధనార్జనే లక్షంగా భవనం ఎలా ఉన్నా జిల్లా విద్యా శాఖ అధికారులు అనుమతులు ఇస్తున్నారు. తరువాత రెన్యువల్ సమయంలో కూడా కేవలం పేపర్ల ఆధారంగానే సర్టిఫై చేస్తున్నారే తప్ప క్షేత్రస్థాయిలో మాత్రం తనిఖీలు చేయడంలేదని పలు విద్యార్థి సంఘాలు అరోపిస్తున్నాయి. దీని వెనుక భారీ మొత్తంలో డబ్బులు చేతులు మారుతున్నట్లు ఆరోపణలు లేకపోలేదు. ఇక విద్యాశాఖ అధికారులది కూడా అదే పరిస్థితి అని పలువురు పెదవి విరుస్తున్నారు. పాఠశాలలను పరిశీలించకుండానే అనుమతులు, రెన్యువల్స్కు గ్రీన్ సిగ్నల్స్ ఇచ్చేస్తున్నట్లు తెలుస్తోంది.
👆హయత్ నగర్ కుంట్లూర్ రోడ్డులో నిబంధనలకు విరుద్ధంగా స్మశానం పక్కన నిర్మించిన భవనంలో, సెల్లార్ నే ఆట స్థలంగా కొనసాగిస్తూ నడిపిస్తున్న రవీద్ర భారతి స్కూల్
కనీస వసతులు కరువు
కొన్ని కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థుల నుంచి వేలకు వేలు ఫీజులు దండుకుంటున్నా వారికి కావాల్సిన కనీస మౌలిక వసతులను కల్పించడం లేదనే విమర్శలు మెండుగా ఉన్నాయి. విద్యార్థులకు తాగేందుకు సరిపడా మంచి నీటిని కూడా అందుబాటులో ఉంచడం లేదనే విమర్శలున్నాయి. వీటితోపాటు విద్యార్థుల సంఖ్యకు సరిపడా మరుగుదొడ్లు గానీ మూత్రశాలలు కానీ ఉండటం లేదు. సహజంగా భార్య, భర్తతో పాటు ఇద్దరు పిల్లలున్న ఓ కుంటుంబం సింగిల్ బాత్రూంతో ఇబ్బందులు పడుతున్నారు. అలాంటిది వందల మంది విద్యార్థులున్న పాఠశాలల పరిస్థితిని గమనిస్తే దారుణంగా ఉంది.
👆 కుంట్లూరు-పసుమముల రోడ్డులో ఎలాంటి భద్రతా ప్రమాణాలు పాటించకుండా ఇంటి భవనంలో నడిపిస్తున్న శ్రీరంగం స్కూల్
టాయిలెట్ల ఇబ్బందితో అమ్మాయిలు నీళ్ళు దాగడమే లేదు..
జిల్లా పరిధిలో కొన్ని కార్పొరేట్, ప్రైవేటు స్కూళ్లలో 300 మొదలుకుని వెయ్యికి పైగా విద్యార్థుల సంఖ్య ఉన్న పాఠశాలలున్నాయి. ఆ పాఠశాలల్లో కూడా నాలుగైదు మరుగుదొడ్లతోపాటు తొమ్మిది పది మూత్రశాలలుంటాయి. పాఠశాల విరామ సమయంలో వాటి ముందు పిల్లలు క్యూలో నిల్చోవాల్సిన పరిస్థితి నెలకొంటోందని పలువురు వాపోతున్నారు. ఇక అమ్మాయిల ఇబ్బందులు వర్ణనాతీతం. కొంతమంది బాలికలు బాత్రూముల సమస్యతో తగినంత నీరుతాగడం మానేస్తున్నట్లు కూడా తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. ఇది కొన్ని రుగ్మతలకు దారితీస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. సంబంధిత అధికారులు పాఠశాలల్లో మౌలిక వసతులపై స్పందించాల్సిన అవసరం ఉంది.
👆 గౌరెల్లిలో అక్రమంగా నిర్మించిన భవనంలో ఇంటెర్నేషన్ స్కూల్ పేరిట నిబంధనలకు విరుద్ధంగా నడిపిస్తున్న రివర్ వ్యాలీ స్కూల్